ఈ ఇద్దరూ కలిసి 1971 యుధ్ధం జరుగుతున్నప్పుడు, బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగినప్పుడు అంటే డిసెంబర్ 1971 లో ఆ యుధ్ధ వార్తలు, విశేషాలు, తమ కబుర్ల ద్వారా ప్రజల్లోకి ఎంతో చక్కగా తీసుకుని వెళ్ళారు.నండూరి సుబ్బారావుగారు బావగారూ అంటూ పిలవటం, వెంటనే రాం మోహనరావు గారు అందుకుని సంభాషణ మొదలు పెట్టటం చాలా బాగుండేది.
అప్పటి ఆ బావగారి కబుర్లు కార్యక్రమాలన్నీ కూడా రికార్డ్ చేసి జాగ్రత్తగా పదిలపరిచి ఉండి ఉంటే అప్పటి చరిత్ర మొత్తం ఇప్పటి తరానికి చక్కగా అవగతమయ్యేది.కాని మనకు ఆ అదృష్టం ఏది, ఆకాశవాణి అధికార్లకు ముందు చూపు లేక అప్పటి రికార్డింగులన్నీ కూడా చెరిపేసి తరువాతి కార్యక్రమాలకు వాడేసుకున్నారుట.బావగారి కబుర్లు కార్యక్రమం, విజయవాడ కేంద్రం నుండి కొన్ని సంవత్సరాలు ప్రసారం అయ్యినా, ఒక్క రికార్డింగ్ కూడా వాళ్ళ దగ్గర లేదుట ఇప్పుడు. అసలు మన ఆకాశవాణి వారికి ఆర్ఖైవ్స్, ఆ ఆర్ఖైవ్స్ కుండవలసిన విధి విధానాలు ఎంత మాత్రం తెలిసినట్టుగా లేవు. అప్పటి అధికార్లు కొద్దిగా ముందు చూపు చూపించి ఉంటే ఎన్నెన్నో అద్భుత మైన రేడియో కార్యక్రమాలు మనకు ఇవ్వాళ దొరికేవి. నెట్లో వేరే దేశాల రేడియో కార్యక్రమాలు ఎప్పటివో 1930ల నుంచి కూడ కనపడుతూ ఉంటే అసూయ కలుగుతుంది.
సరే ఎంత బాధపడి ప్రయోజనం ఏమున్నది. అప్పటి ఆ బావగారి కబుర్ల ద్వయం శ్రీ నండూరి సుబ్బారావు మరియు చివుకుల రాం మోహనరావు గార్లను ఈ బ్లాగ్ ద్వారా తలుచుకుని ఆనదించటమే గొప్ప పని ఈ రోజున.
అవును. నిజమే. మీ కృషి వలన కనీసం గుర్తైనా చేసుకోగలుస్తున్నాము మరియు ఆనందించగలుగుతున్నము . మరొకసారి మీకు నా ధన్యవాదములు.
రిప్లయితొలగించండిమీతో ఏకీభవిస్తాను.
రిప్లయితొలగించండి