5, మే 2010, బుధవారం

అమరావతి కథలు మరో ఆరు కథలు

ఒకసారి తరచి చూసుకుంటే అమరావతి కథలు ఈ మధ్య వ్రాయలేదని అనిపించింది. వెను వెంటనే, ఒక ఆరు కథల గురించి మునుపు తెలుగు వికీపీడియాలో వ్రాసినవి ఇక్కడ మళ్ళి ప్రచురించాను . ఇంతటితో నేను వికీలో అమరావతి కథల గురించి వ్రాయటం ఆపేశాను. మిగిలిన కథలను కాల క్రమెణా వీలును బట్టి నా బ్లాగులోనే వ్రాసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను.


అమరావతి కథలకు ఉన్న ముఖ్య లక్షణాలలో మొదటిది, మళ్ళి మళ్ళి చదివించగల శక్తి. ఒకసారి చదివి చూడండి.

31.మాయ

  • ముఖ్య పాత్ర -చిల్లరకొట్టు సుబ్బయ్య
  • బాపు బొమ్మ -ఇనప్పేట్టె కింద పడి పడి ఉన్న మనిషి, అంత బరువు మీద పడి కూడ చేతిలోని నోటును వదలని ఆ మనిషి చెయ్యి. కథలోని సుబ్బయ్య ఎంతటి డబ్బు మనిషో, డబ్బుకి అతని ప్రాణానికి ఉన్న లంకె ఎంత గట్టిదో బొమ్మ చక్కగా వ్యకపరుస్తున్నది.
  • కథ -చిన్నతనంలో సుబ్బయ్య మరమరాలు అమ్ముకుని బతుకినా, అంచెలంచెలుగా పెద్దవాడయి ఒక చిల్లరకోట్టు, ఆ కొట్టు మీద సంపాదనతో రెండిళ్ళు, చాలా రొక్కం సంపాయించుకున్నాడు. కాని మనిషికి దబ్బుయావ ఎక్కువవటంచేత, పెళ్ళాన్ని, కొడుకులను కూడ నమ్మకపోగా, సరైన తిండి కూడ తాను తినడు వారినితిననివ్వడు. చిల్లరకొట్టు సంపాదనతో పాటు తాకట్టులు, అప్పులు మీద కూడ సంపాదన. కాని చివరకు ఒకరోజురాత్రి బాగ ఆకలివేసిన సుబ్బయ్య వంటింట్లొకెళ్ళి తినటానికె ఏమైనా ఉన్నదేమో అని వెదుకుతుంటే, తన పెళ్ళాం పిల్లలు తనకు మాత్రం పచ్చడి కూడు పెట్టి వాళ్ళు పప్పు కూరలు చేసుకు తింటున్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ దెబ్బతో "పెళ్ళాం పిల్లలు మాయ!, మాయ! మాయ!" అని గొణుక్కుంటూ డబ్బు సంచులూ, ప్రాంసరీ నోట్లూ గుడెలకి హత్తుకుని ప్రాణావిడుస్తాడు. డబ్బు మనిషికి అందరూ దూరమే, డబ్బు అతని వెంటరాదు. ఈ విషయం తెలియ వచ్చేసరికి, జీవితలో ఆలస్యం అయిపోతుంది . ఈ జీవిత సత్యాన్ని, తన చక్కటిశైలిలో రచయిత తన చిన్న కథలో ఇమిడ్చారు.

32.నివేదన

  • ముఖ్య పాత్ర -కోటిలింగం
  • బాపు బొమ్మ -దేవుని ముందు తనకు తానే హారతి అయిపోయినట్టుగా కోటిలింగాన్ని చిత్రణ, కథలో అతనుతన్ని తాను నివేదించుకున్న విషయం సూచన ప్రాయంప్రాయం.
  • కథ - కోటిలింగం తన భార్య అరోగ్యం కోసం మొక్కుకుంటాడు. కాని అమె దక్కక కోటిలింగం దాదాపుపిచ్చివాడయిపోతాడు. ఆ పిచ్చిలోనె మహశివరాత్రి నాడు పరమేశ్వర దర్శనంకోసరం వెళ్ళి అక్కడ జనసందోహంలో దర్శనం దొరక్క గుళ్ళో అభిషేకం పూర్తయ్యేప్పటికి గుడి బయట మరణిస్తాడు. అతని మరణాన్ని, అతని చేతిలోని కొబ్బరికాయ టప్ మని పగిలి రెండుగా విడిపోయింది అని వ్రాసి సూచించారు.

33.ధర్మపాలుడు

  • ముఖ్య పాత్రలు -మున్సబు హనుమయ్య
  • బాపు బొమ్మ -పెద్ద పెద్ద మీసాలతో హనుమయ్య, అతని మీసాలకు త్రాసులు అతని ధర్మ పాలనకు నిదర్శనం
  • కథ -ధర్మాన్ని పాలించేవాడు ధర్మపాలుడు. హనుమయ్య ఒక పరగణాకు మున్సబు. సిస్తులు వసూలుచెయ్యటంలో అతని నేర్పు, అతని న్యాయ వర్తనకు చక్కటి ఉదాహరణలివ్వ బడ్డాయి కధలో. ఒకానొకసంవత్సరం పంటలు సరిగా పండక శిస్తు వసూళ్ళు బాకీ పడతాయి. పైఅధికారి వచ్చి శిస్తు కట్టని వారినిశిక్షించాలంటాడు. గ్రామీణులతోపాటు, తనని కూడ కట్టెయ్యమని, వారిని కొట్టినట్టు తనని కూడ కొట్టమని అధికారికి విన్నవించుకుంటాడు. మా దగ్గర డబ్బుల్లేవు కాని దెబ్బలకు సిద్ధమేనయ్యా అని ఆ అధికారికి తన న్యాయ వర్తనద్వారా ఉన్న విషయం తెలియచెప్తాడు. ఆ అధికారి, ఆ సంవత్సరానికి శిస్తు మాఫీ చేయిస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. హనుమయ్య పాత్రద్వారా పరిపాలనా దక్షత గల ఒక అధికారి ఎలా ఉండాలో చక్కగా చెప్పించారు రచయిత.

34.నాన్న - నది

  • ముఖ్య పాత్రలు -సీతయ్య, అతని తండ్రి
  • బాపు బొమ్మ -మూడు తరాలుగా ఉన్న పురుషాకృతులు కృష్ణా నదీ ప్రవాహంగా వెయ్యటం చక్కగా ఉన్నది. కధా వస్తువను బొమ్మలో చక్కగా చూపించారు.
  • కథ - సీతయ్య తండ్రి మరణించినాక, అతను పడిన దు:ఖం, తన తండ్రితో అనుబంధపూర్వక పాత జ్ఞాపకాలదొంతర, ఈ కథలో ముఖ్యాంశాలు. చివరలో సీతయ్యకు తన తండ్రి మీద ఇంత దిగులు పడుతుంటే, తటాలున తాను కూడ, తన పిల్లలకు తండ్రే అని తడుతుంది. తన తండ్రి తనకు ఎలా మార్గదర్శనమిచ్చాడో అలాగే తానుకూడా, తన పిల్లపట్ల తన బాధ్యత నిర్వర్తించాలన్న విషయం అవగతమయ్యి కొంత స్వాంతన పడతాడు . దాదాపు అందరి జీవితాలలోను ఎదురయ్యే సంఘటనలను, జీవిత సత్యాలుగా తీర్చి, సందేశాత్మకంగా కథారూపమిచ్చారు రచయిత.

35.కీలుగుర్రం

  • ముఖ్య పాత్రలు- ఎవరూ లేరు
  • బాపు బొమ్మ- కీలుగుర్రం మీద ఉన్న పరమేశ్వరుడు చేతిలోని చర్నాకోలతో అర్చకుడు సూరయ్యను దెబ్బవేస్తున్నట్టు, ఆ పక్కనే బూబి , కధాంశానికి దర్పణం
  • కథ - ఈ కథ కూడ అమరావతి గుళ్ళో జరిగే సంరంభాలలో ఒకటైన కీలుగుర్రం ఉత్సవం గురించి. పాపంచేసినవాడు అర్చకుడైనా సరే దేవుడు క్షమించడు అన్న విషయం చెప్పబడింది. అటువంటి ఊరేగింపులలో, గ్రామ ప్రాంతాలలో జరిగే హడావిడి యావత్తూ కళ్ళకు కట్టినట్టు వర్ణించబడినది.

36.అచ్చోసిన ఆంబోతులు

  • ముఖ్య పాత్రలు-ఆంబోతు, వీరడు
  • బాపు బొమ్మ- అచ్చోసిన ఆంబోతు మీద వీరడు ఊరిలోని దుర్నీతిపరులను హడలెత్తిస్తున్నట్టు
  • కథ-ఊళ్ళొ జరిగే అన్యాయాలకు, నోరులేని జంతువైనా, అచ్చోసిన ఆంబోతుగా తీవ్రంగా స్పందిస్తూ, అన్యాయపరుల పని పడుతుంటుంది. వీరడు రౌడీ, తాగుబోతు గా పిలవబడుతున్నా, దుర్మార్గులను అదిలించిబెదిరించి తెచ్చిన సొమ్ము బీదవాళ్ళకు ఆ దుర్మార్గుల చేతులో దెబ్బతిన్నవారికి పంచిపెడుతూంటాడు. ఈఇద్దరూ కలసి ఊరిలోని దుష్టుల ఆటలు ఎప్పటికప్పుడు కట్టిస్తూ ఉంటారు. ఆందుకనే, కథ పేరు ఏకవచనంలో కాకుండా బహువచనంలో ఉన్నది!! "అల్లుడికి అన్నం పెట్టి తను పస్తుండాలి", "తాతలు సంపాదిస్తే మేమంతా మీ దగ్గరకు ఎందుకు వస్తామండీ?" వంటి వ్యాక్యాలు కథలో అతి తక్కువ మాటలతో ఎంతో చెప్పినాయి.
మిగిలిన కథల గురించి వీలుని బట్టి ప్రచురించటం జరుగుతుంది

4 కామెంట్‌లు:

  1. Sir,
    I request you to write about these stories in wiki also. because wiki is read by more people and it is an encyclopedia..
    please consider my request..

    -Karthik

    రిప్లయితొలగించండి
  2. Karthikjee, thank you for your comment. But unfortunately, there is no proper atmosphere in Telugu Wikipedia for people who wish to write actively.

    రిప్లయితొలగించండి
  3. I bought this book recently in Hyd and I am almost done reading all the stories. 'Amaravati kathalu' is my favourite book.

    రిప్లయితొలగించండి
  4. Oh, is it??
    I dont know that. As a well wisher of wiki I told that. However, I respect your decision.

    -Karthik

    రిప్లయితొలగించండి

1. అజ్ఞాతంగా, వివరాలు లేని ప్రొఫైల్ తో వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు చదవకుండానే తొలగించబడతాయి.
4. వ్యాఖ్యలు వ్యాసానికి సంబంధించి విశ్లేషణాత్మకంగా వ్రాయాలని వినతి.