ఊళ్ళు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఊళ్ళు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, సెప్టెంబర్ 2009, సోమవారం

శాయపురం మా ఊరు 2

శాయపురం, మా అమ్మ పుట్టిల్లు. ఆ ఊరికి క్రితం సంవత్సరం 2008లో వెళ్ళటం జరిగింది. మా అమ్మ ఆ ఊరిగురించి అనేక కథలు చెప్పేది. కాని నేను ఏనాడు ఆ ఊరు వెళ్ళటం తలపెట్టలేదు. ఆవిడ పోయినాక నేను మా తమ్ముళ్ళు కలసి అసలు ఆ ఊరు చూద్దం అని బయలుదేరి వెళ్ళాం.
==============================================
శాయపురం (Sayapuram), కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామ జనాభా 3000 నుండి 4000 వరకు ఉంటుంది.

గ్రామ చరిత్ర
ఈ గ్రామమునకు ఈ నామము షాహిపురం నుండి వచ్చినది. ఈ ఊరి పెద్దల, వృద్దుల కధనం ప్రకారము 16 శతాబ్దమునందు ఈ గ్రామము ఏర్పడినది అని, ఆ రొజులలొ ఈ ప్రాంతము పరిపాలించుచున్న నవాబు హిందూ దివాను ఇచ్చటికి వచ్చి చెరువు వద్ద విశ్రాంతి తీసుకున్నాడు అని. ఆ చెరువునీటి రుచి ఇష్టపడి. అక్కడ ఒక శివాలయము, ఒక విష్ణు ఆలయం కట్టదల్చుకొని అక్కడ మసీదు కడుతున్నట్లు చెప్పి నిధులు తీసుకొని ఆలయములు కట్టించినాడు అని (ఈ కధనముననుసరించి ఇక్కడ విష్ణాలయము, శివాలయములు కలవు).అక్కడికి కొంత దూరంలో మసీదు కూడా కట్టించి తరువాత ఈ ప్రాంతమునకు షాహిపురమని పేరు పెట్టినట్లుగా చెపుతారు. కాలక్రమంలో షాహిపురం శాయపురంగా మారినదిగా ఆ గ్రామ పెద్దలు వివరించారు. ఈ ఊరిపేరుకు, షిరిడి శాయికి గాని, పుట్టపర్తి శాయికి కాని సంబంధంలేదు

దేవాలయములు
పురాతనమైన విష్ణుదేవాలయం కలదు. శిధిలమైన దేవాలయము స్థానమున పునరుద్ధరించబడిన శివాలయము కలదు.




వ్యవసాయ విషయాలు
ఈ గ్రామము నందు ముఖ్యమయిన పంటలు వరి మరియు చెరకు.

విద్యా సౌకర్యాలు
ఈ గ్రామములో ఒక పాఠశాల ఉన్నది. ఈ పాఠశాలలొ రేడియో పాఠాలు విని నేర్చుకొనే సదుపాయం కలుగజేశారు.

రవాణా సదుపాయములు
ఈ గ్రామమునకు ఇప్పటికి కూడ సరయిన ప్రయాణ సదుపాయములు లేవు. విజయవాడ నుండి బస్సులొ నాగాయలంక, అవనిగడ్డ మార్గములో బస్సు ఎక్కి, ఉయ్యూరు దాటిన వెంటనే, గోపువానిపాలెం స్టాపులొ దిగాలి. అక్కడినుంచి ఆటోలొ శాయపురంకు వెళ్ళవచ్చు. ఈ ఊరు విజయవాడకు చాలా దగ్గర.
==============================================
ఆ ఊరు మా తమ్ముళ్ళతో కలసి జనవరి 2008లో మొట్టమొదటి సారి వెళ్లాను. అంతవరకు ఆ ఊరు గురించి మా అమ్మ చెప్పగా వినటమే కాని చూసింది లేదు. అక్కడకు వెళ్ళగానే, కనిపించిన మొదటి వ్యక్తిని, ఇక్కడ శుధ్ధపల్లి రామమూర్తిగారి(మా తాతగారు)ఇల్లు ఎక్కడండి అని అడిగాను. ఆయన వెంటనే, వారు ఈ ఊరు ఒదిలిపెట్టి చాలా రోజులయ్యింది(డెబ్భై సంవత్సరాలయ్యింది) కాని వారి ఇల్లు ఫలానా చోటున ఉండేది అని చెప్పారు. పల్లెటూళ్ళల్లో ఎంత గుర్తు మనుషులమీద! ఇక ఆ ఊళ్ళొనే 83 సంవత్సరాల వృధ్ధుడు చావలి భానుమూర్తిగారిని కలసి పాత విషయాలు అనేకం తిరగేసాం. ఆయనే మాకు శాయపురానికి ఆ పేరు ఎలా వచ్చిందో వివరించారు. అప్పుడు తీసిన వీడియోలో కొంత భాగం ఈ కింద ఇవ్వటం జరిగింది.

26, సెప్టెంబర్ 2009, శనివారం

మా ఊరు - 1 (వెన్నూతల)

నేను ఈ ఊళ్ళో పుట్టలేదు, పెరగలేదు, నాకు ఇరవై ఏళ్ళు వచ్చేవరకు అక్కడకు వెళ్ళలేదు.కాని, మా నాన్నగారు, వారి పూర్వీకులు, ఈ గ్రామం వారు. మా పూర్వీకుల గ్రామాల గురించి వ్రాద్దామని మొదలు పెట్టి మొదట మా తండ్రి గారి వైపునుండి మొదలుపెట్టాను. మరొక వ్యాసంలో మా అమ్మగారి గ్రామం గురించి . ***********************************************************

వెన్నూతల, కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము విజయవాడకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. గ్రామ జనాభా సుమారు 2000-నుండి 3000 వరకు ఉండవఛ్ఛును. ఈ గ్రామము గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గము పరిధిలోకి వస్తుంది. ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయము మరియు వ్యవసాయ సంబంధ వృత్తులపై ఆధారపడి ఉన్నారు. ఇక్కడి వ్యవసాయ కుటుంబాల వారు దాదాపు 3-4 తరాల వెనుక తూర్పు జిల్లాల నుండి వలస వచ్చారని పెద్దలు చెబుతుంటారు.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. (అధికంగా బస్సులు). విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.


వ్యవసాయం
ఇక్కడి ప్రజల జీవనాధారం వ్యవసాయం. ప్రధానమైన పంట వరి.


నీటి వనరులు
వ్యవసాయం కొరకు , కృష్ణా నది నుండి ఈ గ్రామము మీదుగా ఒక కాలువ కలదు.


ఆలయాలు
ఈ ఊరిలొ ఒక పురాతనమైన శివాలయం ఉంది. అది దాదాపు 150 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. .2006-07లో ఈ ఆలయమును పునరుద్ధరించినారు. ఆ సమయములొ జరిగిన తవ్వకాలలో లభ్యమయిన ఆధారాల ప్రకారము ఈ ఆలయమును 1880 ప్రాంతములో నిర్మించి ఉంటారని తెలుస్తున్నది. ఈ ఆలయమును కప్పగంతు మరియు లొల్లా వారి కుటుంబముల వారు నిర్మించినారని పెద్దలు ఛెప్తారు. ఈ ఆలయము ముందు ఒక పెద్ద కోనేరు(చెరువు) ఉంది.ప్రతి సంవత్సరం మే నెలలో వైశాఖ పౌర్ణమి రోజున రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కల్యాణం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామి వారి కల్యాణం చూసి ఆనందిస్తుంటారు. ఆలయ ధర్మకర్తలైన ఇటీవల ఊరిలో ఉన్న పురాతనమైన రామాలయంను కూడా పునరుద్ధరించారు. ఈ ఆలయం కూడా కోనేరుని ఆనుకొని వున్నది.

ఇతర సదుపాయాలు కప్పగంతు అచ్యుతరామయ్య గారు గ్రామ పంచాయతీ సర్పంచిగా ఉన్న కాలములో ఈ గ్రామమునకు రహదారి ఏర్పడింది. కప్పగంతు లక్ష్మినరసింహం గారు రహదారి కొరకు తన పొలమును ప్రభుత్వమునకు ఇచ్చుటకు ముందుకు రావడం వల్ల ఇది సాధ్యమయ్యింది. రహదారి 1967-69లొ పూర్తయ్యింది.


ప్రయాణ సదుపాయాలు ప్రత్యేకముగా ఈ గ్రామమునకు బస్సు సౌకర్యాములేదు. దగ్గరలోని రైలు స్టేషను తరిగొప్పుల(విజయవాడ-మచిలీపట్నం మార్గము) గన్నవరమునుండి(4-5 కిలోమీటర్ల దూరం) వరకు ఆటోలో వెళ్ళవచ్చును (ఫొటోలో చూడండి),విజయవాడ, ఏలూరు మరియు ఇతర పట్టణాలకు జాతీయ రహదారిపై తిరిగే వాహనాల ద్వారా(గన్నవరం మీదుగా) ప్రయాణం చేయవచ్చును. విజయవాడ నుండి ఈ గ్రామము మీదుగా ఒక సిటీ బస్సు (116 నంబరు)నడుస్తున్నది.

అబ్దుల్లా

మా ఊరులో కొంతకాలం మా పొలం కౌలుకి తీసుకుని పంట పండించిన అబ్దుల్లా(మా నాన్నగారికి మంచి స్నేహితుడు),నేను మా ఊరుకి వెళ్ళినప్పుడు, ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేక, పక్కనే ఉన్న గన్నవరంలో ఉంటున్నాడని తెలిసింది. ఆయన అనారోగ్యం వల్ల మాట సరిగ్గా రావటంలేదు. ఆయన నాటకాలలొ వేస్తూ ఉండేవాడు. ముఖ్యంగా హరిశ్చంద్ర లో పద్యాలకు, గ్రామంలో మంచి పేరున్నది.

అంత అనారోగ్యంలోనూ, నన్ను చూసి ఆనందంగా కూచుని మంచి మాటలు నాలుగు మాట్లాడి, అదే ఊపులో పద్యం అందుకున్నాడు.పద్యం పెద్దగా అర్థం కాకపోయినా, ఆయన ఉత్సాహం గమనించాలి.నాకు మా బాబాయిలు ఎంతో ఈయన కూడ అంతే.వీడియో చూసి/విని ఆనందించండి.