చందమామ ధారావాహికలో పుస్తకంగా వచ్చినది విచిత్ర కవలలు. కాకపొతే ఆ పుస్తకంలో బొమ్మలు రంగులలో లేవు. తన చిన్నతనంలో ఆ పుస్తకాన్ని కొనుక్కోవటమే కాకుండా దశాబ్దాల పాటుగా పదిలంగా దాచుకున్న చందమామప్రియులు శ్రీ మట్టెగుంట అప్పారావుగారు (సురేఖ కార్టూనిస్టు). వీరు రాజమండ్రిలో ఉంటారు. ఆయన సేకరించిన ఈపుస్తకంలోని కొన్ని బొమ్మలను మన అందరితోను పంచుకోవటానికి పంపారు. ఆ బొమ్మలు (రంగులు లేవు) ఈ కిందఇవ్వబడినాయి. రంగులు లేకపోయినా, చిత్రా గారి నైపుణ్యం కనపడుతూనే ఉన్నది.
ఈ కింది బొమ్మలు చూడండి అందులో ఒకటి మొదటిసారి ధారావాహిక వేసినప్పటిది రెండవది తరువాత రంగులలో వేసినప్పటిది. దాదాపు ఒకేలాగా ఉన్న బొమ్మలు ఇవి.
చిత్రా గారి బొమ్మల్లో చాలా గొప్ప ఆకర్షణ ఉంటుంది. ‘చందమామ’ పాఠకులకు చేరువవటంలో ఆయన చిత్రాల పాత్ర ఎంతో ఉంది.
రిప్లయితొలగించండి‘తన పేరు బొమ్మలోని రాయి మీద రాసుకోవటం చాలా ఇష్టంగా ఉన్నట్టుంది’- చక్కటి పరిశీలన!