


చదువుతాం.రాజకుమారులు, మాంత్రికులు,దేవకన్యలూ,
ఎగిరే గుర్రాలు ఇలా మనల్ని మరోవింతలోకాలకు తీసు
కొని వెళ్ళే కధలు. సాంఘిక కధలు, ఆసలు అగుపించవు.
ఐనా 1953 మార్చి సంచికలో "పక్షి దాచిన జాబు"అనే
సాంఘిక కధ, వి.నారాయణమ్మ గారు వ్రాసింది ప్రచురించ
బడింది. ఈ కధ ప్రారంభమే ఇలా సాగుతుంది!
"మద్రాసు,త్యాగరాయనగరులో రత్నం,సీతాపతి,అని
యిద్దరు తెలుగు కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు.చిన్నప్పటి
నుంచి ప్రాణస్నేహితులుగా పెరిగారు"
క్లుప్తంగా కధ ఏమిటంటే ఓ నాడు ఈ ఇద్దరూ బజారులో
చిత్రంగా దెబ్బలాడు కొంటారు. మరు నాడు సీతాపతి నెత్తురు
మడుగులో చనిపోయి అగుపిస్తాడు. అందరూ రత్నాన్ని
అనుమానిస్తారు.పోలీసులు రత్నాన్ని అదుపులోకి తీసు
కొంటారు. ఈ లోగా ఆ ఊరి గుడి గోపురం పైకిఎక్కి ఆట
లాడు కొంటున్న పిల్లల్లొ ఒకడికి గుడి గూటిలో ఓ ఉత్తరం
అగుపిస్తే దాన్ని తన తండ్రికి చూపిస్తాడు.అందులో సీతాపతి
తను చెడువ్యసనాలకు బానిసైనానని, స్నేహితుడు రత్నం ఎంత
చెప్పినా వినలేదని, అప్పుల్లో కూరుకుపోయిన తను ఆత్మ
హత్య చేసుకొంటున్నాని వుంటుంది.అది అతని దస్తూరీ
అని నిర్ణయించి రత్నాన్ని విడుదల చేస్తారు.ఇదీ "పక్షి
దాచిన జాబు" కధ. ఇలా "చందమామ"లో ఓ సోషల్ కధ
అబ్బాయిలు పాంటు ,ఇన్ షర్టులతో అగుపించడం ఆరోజుల్లో
మాకు వింతగా తోచింది.అటు తరువాత అలాటి కధలు
మళ్ళీ మాకు మన చందమామలో అగుపించలెదు.ఈ రోజు
1953 నాటి నా పాత చందమామ వాల్యూమ్ చూస్తుంటే
ఈ కధ అగుపించి నా భావాలు మీతో పంచుకోవాలనిపించింది.
=============================================
పిల్లలకు తమ చుట్టూ తాము రోజూ చూస్తున్న విషయాలనే కూర్చి కథలుగా చెప్తే పెద్దగా ఇంటరెస్టు చూపించరు. అందుకే వాళ్ళకు కథలు చెప్పే నేర్పు ఉన్న బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అప్పటికప్పుడు ఎన్నెన్నో విచిత్ర ప్రపంచాలను సృష్టించి కథలు చెప్తూనే వారికి చెప్పవలసిని నీతులు, నడవడిక రీతులను బోధించేవారు. ఇదే కీలకాన్ని పట్టుకుని, కొడవటిగంటి కుటుంబరావుగారు చందమామను దశాబ్దాలపాటు నిర్విఘ్నంగా పిల్లల అభిమాన పత్రికగా నడిపారు. అందుకనే, ఈ నాటికి ఆయన సంపాదకత్వంలో వెలువడ్డ చందమామ పాత ప్రతులంటే అంత పిచ్చి, క్రేజ్ ఆపైన సేకరణ చెయ్యాలన్న ఆతృత. చందమామ కథల వెనుక ఒక సైన్సు ఉన్నది అని ఆంధ్ర జ్యోతి (నవ్య) వారపత్రిక సంపాదకత్వంలో అదీ 2010లో వ్రాశారంటె, చందమామ కథలు అప్పటి బాలల మనోఫలకాలమీద ఎంతటి చెరగని ముద్రలు వేశాయో తెలుస్తున్నది.
పాత సంచికలు తమ వద్ద ఉన్న వారు ఒక విషయం గమనించవచ్చు. చిత్రా, శంకర్ చిత్రకారులు చందమామ మొదటినుంచీ ఉండి బొమ్మలు వేసినప్పటికీ, వారి బొమ్మల్లో జీవం, కథలకు సొగసునిచ్చే గుణం, కుటుంబరావుగారి సంపాదకత్వంలోనే అబ్బిందని చెప్పాలి. చందమామ గొప్పతనం గురించి చెప్పుకునేప్పుడు, చిత్రా, శంకర్, వడ్డాది పాపయ్యలగార్లకు పెద్ద పీట వెయ్యాలి. కొడవటిగంటి, చిత్రా, శంకర్, వడ్డాది పాపయ్యలు నలుగురూ నాలుగు స్తంభాలుగా, ఆపైన కప్పుగా చక్రపాణి నాగిరెడ్డిగార్లు, చందమామను నభూతో:నభవిష్యతి: గా నడిపారు. మరి ఇప్పుడు......
చందమామకు పోటీగా ఒక పత్రిక ఉండేది "బాలమిత్ర" అని. అందులో అన్ని రకాల కథలు వేసేవారు. ఒక్క జానపదమే కాదు, సాంఘిక డిటెక్టివ్ కథలను కూడ ఆ రోజుల్లోనే వేసేవారు. విదేశీ కథలను యధాతథంగా అవే పేర్లతో ప్రచురించేవారు కాని పాపం, చందమామకు వచ్చిన ప్రాశస్త్యం బాలమిత్రకు రాలేదు. బాలమిత్ర పాత సంచికలు సంపాయించాలని, అవి మళ్ళి చదవాలని తహతహలాడేవాళ్ళను నేను చూడలేదు.
చందమామ మహోన్నత కాలంలో ప్రతి నెలా ఆ సంచిక అందుకుని చదువుకున్న అదృష్టవంతులుగా, అలనాటి చందమామనే మళ్ళి మళ్ళి చదువుంకుటూ ఇప్పటికీ ఆనందపడుతున్న అప్పటి పిల్లలు, ఇప్పటి పెద్దలైనా కూడ పిల్లలుగానే ఉండగలిగినవారు నాతో ఏకీభవిస్తారనుకుంటాను.

రాజుగారూ, శంకర్ గారు చక్కగా చెప్పారు. చందమామకాని మరే పత్రిక కాని జనం చదివేది కాస్త సేద తీరటానికి. అక్కడ కూడా లోకంలో ఉన్న సమస్త విషయాలు వ్రాసేస్తే, మానసిక ఉల్లాసం ఎలా వస్తుంది? కాల్పనిక ప్రపంచంలో పడి కొంతదూరం పోయినాక మనస్సుకు హాయిగా అనిపిస్తుంది. అందుకనే చందమామలో ఏ కథ అయినా కూడా చక్కగా చదివి ఆనందించే వాళ్ళం.
పత్రికలకు కథలు వ్రాసే రచయితలూ, ముఖ్యంగా చందమామ కు వ్రాసేవారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, చదువరులకు మీ మీ ఇజాలు అవి అక్కర్లేదు, మీ వెర్రి మొర్రి ఆలోచనలను మామీదకు నేట్టకండి. చదివినంతసేపు హాయిగా ఉండాలి, పడిన కష్టం మరచిపోవాలి.
ఈ విషయంలో దాసరి వారి నిబద్ధత రచయితలందరూ పాటించ వలసినది. తానూ స్వతహాగా వామ పక్ష ధోరణులు కలగి ఉన్నా, ఏనాడూ కూడా తన ఆలోచనలను చిన్నారి చదువరుల మీద రుద్దే ప్రయత్నం ఏనాడూ చెయ్యలేదు. అలాగే కొడవటిగంటి కూడా సాహిత్య వ్యవసాయాన్ని పార్టీ వ్యవసాయంగా ఏనాడు మార్చలేదు.
శివరాం గారూ,
‘చింతచెట్టు దయ్యం’ సింగిల్ పేజీ కథకోసం బొమ్మ గీస్తూ ఉండగానే శంకర్ గారికి మరో పనిమీద ఫోన్ చేసాను. గొంతు గుర్తుపట్టిన వెంటనే ఆయన కథ గురించి ఎత్తుకున్నారు. నా ఉద్దేశ్యంలో ఆయన చిత్రకారుడిగా కథలో దృశ్యం కోసం వెతుక్కున్నారు. చింతచెట్టు.. దానిపై దయ్యం… మనిషిని చూడగానే అది దబ్బున కిందికి దూకడం… రూపంలో అయనకు కథలో దృశ్యం నేరుగా తట్టేసింది. అంతే… ఆయన ఆ కథను అమాంతం పైకెత్తేశారు.
అందులోనూ ఆ కథను తెలుగులో మరొకరు చదువుతూంటే వినడం కాకుండా ఇంగ్లీషు అనువాదాన్ని నేరుగా చదువుతూ కథ సారాన్ని పట్టేశారు. ‘ఎన్నాళ్ల తర్వాత మళ్లీ కొత్తగా దయ్యం కథకు బొమ్మ వేస్తున్నాను’ అంటూ మహదానందపడ్డారు. ఎలాంటి కథ పంపినా బొమ్మలు గీయవలిసిన బాద్యత తన పై ఉన్నప్పటికీ, చందమామలో కథలు తగ్గుతున్న పరిణామం పట్ల తన అసంతృప్తిని ఆయన లీలామాత్రంగానే వ్యక్తపరిచారు.
రోహిణీ ప్రసాద్ గారి అనువాదం చక్కగా సాగిపోయినట్లుంది. అనువాదం చేసింది కుటుంబరావు గారి అబ్బాయి అని చెబితే సంతోషపడ్డారు. పెద్ద కొడుకు రామచంద్రరావు ఇలా కథలు, అనువాదాలు పట్టించుకోకుండా తొలినుంచీ కెమెరాకే పరిమితం అయ్యాడంటూ పాత జ్ఞాపకాలు తల్చుకున్నారు. కుటుంబరావు గారు పోయాక వారి కుటుంబంతో సంబంధాలు తగ్గుతూ వచ్చాయట. కొకు వారసుడిగా రెండో అబ్బాయి ప్రస్తుతం చందమామ ప్రాజెక్టులలో పని చేస్తున్నారని చెబితే సంతోషించారు.
శివనాగేశ్వర రావు గారు రాయగా మీరు అనువదించిన బేతాళ కథ “స్వర్ణపుష్టం” ఏప్రిల్ సంచికలో వస్తోంది. దానికి బొమ్మలు వేయడం పూర్తయిందని చెప్పారు. మీరు రాసి పంపిన తొలి బేతాళ కథ “నిజమైన చదువు” కు కూడా బొమ్మలు వేసేశారు. ఇవి రెండూ వరుసగా ఏప్రిల్, మే నెల సంచికలలో రాబోతున్నాయి.
రోహిణీ ప్రసాద్ గారు, చందమామ సీనియర్ కథకులు సత్యనారాయణ శర్మ గారు -విశాఖపట్నం- రచించిన బేతాళ కథలు జూన్, జూలై సంచికలలో రావచ్చు. వీలైనంత ఎక్కువగా కొత్త కథలను వేయడానికి పూనుకుంటున్నాము కాబట్టి ఈ సంవత్సరంలో కథలు పంపిన అందరికీ న్యాయం జరగవచ్చనే అనుకుంటున్నాము.